ఈ నెల 16 నుంచి విద్యాసంవత్సరం

by  |
ఈ నెల 16 నుంచి విద్యాసంవత్సరం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలో నూతన విద్యాసంవత్సరాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహకాలు చేస్తుంది. ఈ నెల 16 నుంచి తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లను చేపట్టింది. పాఠశాలల నిర్వహణ, చేపట్టాల్సిన ఏర్పాట్లపై విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాధనలు అందించింది. 8 నుంచి 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా పాఠాలు బోధించేందుకు నిర్ణయించారు.

కరోనా ప్రభావంతో గతేడాదిలా విద్యార్థులు నష్టపోకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్ వ్యాధి వ్యాప్తి పూర్తిగా తగ్గితే జులై నెల నుంచి రోజు విడిచి రోజు పాఠశాలలను నడిపేందుకు ఆలోచనలు చేస్తున్నారు. జూన్ నెలాఖరు వరకు పరిస్ధితులు అదుపులోకి రానుండటంతో స్కూళ్లను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది.



Next Story

Most Viewed