తొలిరోజు 246 మందికే దర్శనం..

by  |
తొలిరోజు 246 మందికే దర్శనం..
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళ‌ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శబరిమల ఆలయం శుక్రవారం తెరుచుకున్న విషయం తెలిసిందే. అయితే, ఇవాళ్టి నుంచి భక్తుల దర్శనాలు ప్రారంభమయ్యాయి.తొలిరోజు దర్శనం కోసం కేవలం 246 మంది మాత్రమే రిజిస్టర్ చేసుకున్నారు. దీంతో గతంలో రోజుకు 1000 మందిగా ప్రకటించిన దర్శనాల సంఖ్యను అధికారులు 250కు కుదించారు.

అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, దర్శనానికి 48గంటల ముందు కరోనా టెస్టు చేయించుకోవాలని నిబంధనలు పెట్టారు. కాగా, భక్తులు ఎవరూ పంపా నదిలో స్నానాలు ఆచరించరాదని ట్రావెన్ కోర్ సంస్థాన అధికారులు స్పష్టంచేశారు.



Next Story

Most Viewed