గుడ్‌న్యూస్.. ఎల్లుండి రైతుల అకౌంట్‌లో డబ్బులు

by  |
గుడ్‌న్యూస్.. ఎల్లుండి రైతుల అకౌంట్‌లో డబ్బులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రైతుబంధు పథకం అమలు కోసం రూ.7,580 కోట్లు అవసరమవుతాయని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతుబంధు పథకం అమలు చేసేందుకు లబ్దిదారుల తుదిజాబితాను సీసీఎల్ఎకు అందించామన్నారు. రాష్ట్రంలో 63,25,695 మంది రైతులకు కోటి 50లక్షల 18వేల ఎకరాల భూమి ఉందని ప్రకటించారు. గత యాసంగి కన్నా ఈ సారి 2.81 లక్షల మంది రైతులు పెరిగారని, నూతనంగా 66,311 ఎకరాలు జాబితాలో చేరాయని తెలిపారు. మొదటిసారి అర్హులైన రైతులకు చెందిన పట్టాదార్ పాసుబుక్, ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతాల స్థానిక ఏఈఓలు, ఏఓలను కలిసి పట్టాదార్ పాసుబుక్కు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలతో కూడిన నకలు అందించాలని సూచించారు. బ్యాంకుల విలీనంతో ఐఎఫ్ఎస్ సీ కోడ్ లు మారిన ఖాతాదారులు ఆందోళన చెందవద్దని ఏమైన అనుమానాలుంటే స్థానిక వ్యవసాయాధికారులు నివృత్తి చేస్తారని వివరించారు. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 12.18 ఎకరాలకు చెందిన 4,72,983 మంది రైతులు రూ.608.81 కోట్లను, అత్యల్పంగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 77 వేల ఎకరాలకు చెందిన 39,762 మంది రైతులు రూ.38.39 కోట్లను అందుకుంటున్నారని తెలిపారు. ఏడు జిల్లాలకు రూ.300 కోట్ల నుండి రూ.400 కోట్లను, 11 జిల్లాలకు రూ.200 నుండి రూ.300 కోట్లను, 10 జిల్లాలకు రూ.100 నుండి రూ.200 కోట్లను రైతుబంధు ద్వారా పంపిణీ చేస్తామన్నారు. వరంగల్ అర్బన్ , ములుగు, మేడ్చల్ జిల్లాలకు రూ.100 కోట్ల లోపు నిధులు పంపిణీ చేస్తామన్నారు. ఈ నెల 15 నుండి 25 వరకు రైతుబంధు నిధులు రైతుల ఖాతాలలో జమచేయబడతాయని తెలిపారు. రాష్ట్రంలో ఏడోసారి రైతుబంధు నిధులు విజయవంతంగా రైతుల ఖాతాలలోకి జమచేస్తున్నామని వివరించారు. గత ఏడాది వానాకాలం, యాసంగి సీజన్లకు గాను రూ.14,656.02 కోట్లను, ఈ వానకాలం, యాసంగి సీజన్ల కోసం బడ్జెట్ లో రూ.14,800 కోట్లు కేటాయించామన్నారు.


Next Story