దసరా పండగకు ప్రత్యేక బస్సులు

by  |
దసరా పండగకు ప్రత్యేక బస్సులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో అతిపెద్ద పండగ అయిన దసరా పండగకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే బస్సులను తిప్పుతున్న ఆర్టీసీ పండగ వేళ మరిన్ని బస్సులు నడిపేందుకు రెడీ అయ్యింది. పండగ పూట ప్రజలను గమ్య స్థానాలకు పంపేందుకు దాదాపు 3వేల బస్సులను సిద్ధం చేసింది. హైదరాబాద్‌లో ఎంజీబీఎస్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్‌, ఉప్పల్ రింగ్ రోడ్డు, కూకట్‌పల్లి, అమీర్‌పేట నుంచి పలు జిల్లాలకు బస్సులు బయలు దేరనుండగా అటు రాష్ట్రంలోని పలు పట్టణాల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులకు అడ్వాన్స్‌ బుకింగ్ సౌకర్యం కూడా అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు.



Next Story

Most Viewed