సజ్జనార్ మరో కీలక నిర్ణయం.. వారికి గుడ్ న్యూస్

by  |
MD sajjanar
X

దిశ, డైనమిక్ బ్యూరో : TSRTC ఎండీగా డైనమిక్ ఆఫీసర్ సజ్జనార్ నియామకం అయినప్పటి నుంచి సంస్థలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రయాణికుల ఆదరణతో పాటు సంస్థను క్రమశిక్షణలో ఉంచేందుకు సజ్జనార్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో రానున్న పెళ్లిళ్ల సీజన్‌లో ప్రైవేటు బస్సులను పక్కన పెట్టి ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకునేలా సెక్యూరిటీ డిపాజిట్‌ను తొలగించారు. దీంతో పెళ్లిళ్లకు భారీగా బస్సులు బుక్ అయ్యాయి.

అదే క్రమంలో తాజాగా అయ్యప్ప భక్తులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. శబరిమల వెళ్లే భక్తులు ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ లేకుండా బస్సులను బుక్ చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చినట్లు సజ్జనార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. బస్సును బుక్ చేసుకోవాలనుకునే వారు దగ్గరలో ఉన్న ఆర్టీసీ డిపో మేనేజర్‌ను సంప్రదించాలని కోరారు.


Next Story

Most Viewed