ఆర్టీసీ సజ్జనార్ కీలక నిర్ణయం.. ఆనందంలో మహిళలు

by  |
TS RTC MD Sajjanar
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ నియామకం అయినప్పటి నుంచి ఆర్టీసీలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆర్టీసీని లాభాల బాట పట్టించడానికి ఆయన కొత్త కొత్త ఆలోచనలతో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. తాజాగా మరో నిర్ణయంతో వీసీ సజ్జనార్ మహిళా కండక్టర్లకు తీపి కబురు అందించారు. ఆర్టీసీలో పనిచేస్తున్న మహిళా కండక్టర్‌లకు రాత్రి 8 గంటల వరకే డ్యూటీ వేయాలని అధికారులను ఆదేశించారు. రాత్రి 8 గంటల లోపే వారి డిపోలకు చేరుకునేలా డ్యూటీ వేయాలని సూచించారు. దీంతో మహిళా కండెక్టర్ల ఆనందం అంతా ఇంతా కాదు. అంతే కాకుండా ఏ మహిళా కండెక్టర్‌కు రాత్రి ఎనిమిది దాటిన తర్వాత డ్యూటీ వేయకూడదని, 8 గంటల తర్వాత డ్యూటీ వేయాల్సి వస్తే కారణాన్ని హెడ్ ఆఫీసుకు తెలియజేయాలని తెలిపారు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఉద్యోగాలు, మంచి వేతనం, అప్లై చేయండి.


Next Story

Most Viewed