- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. మీనాక్షి నటరాజన్కు అవకాశం
దేశవ్యాప్తంగా జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు ఏడుగురు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసింది.

X
దిశ, వెబ్డెస్క్: దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఏడుగురు అభ్యర్థుల పేర్లను రాష్ట్రాల వారీగా ప్రకటించింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్కు మధ్యప్రదేశ్ నుంచి అవకాశం కల్పించారు. కర్ణాటక నుంచి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పవన్ ఖేరా, మన్సూర్ అలీఖాన్, రాజస్థాన్ నుంచి నీరజ్ డాంగి, తమిళనాడు నుంచి ప్రవీణ్ చక్రవర్తి, జార్ఖండ్ నుంచి ప్రవీణ్ ఝాకి రాజ్యసభ సీట్లను కేటాయిస్తూ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story






