మహా డేంజర్.. ఆర్టీసీపై కరోనా పంజా ​

by  |
మహా డేంజర్.. ఆర్టీసీపై కరోనా పంజా ​
X

దిశ, తెలంగాణ బ్యూరో : మహారాష్ట్ర సరిహద్దుల నుంచి కరోనా వైరస్​ వ్యాప్తి వేగంగా వస్తోంది. ఆర్టీసీ కార్మికులు అత్యధికంగా ఈ సరిహద్దుల్లో బలవుతున్నారు. రాష్ట్రం నుంచి మహారాష్ట్ర సరిహద్దులకు బస్సులు నడిపే 320 మందికిపైగా కార్మికులకు కరోనా పాజిటివ్​ తేలింది. ఈ రెండు రోజుల వ్యవధిలోనే మరిన్ని కేసులు నమోదయ్యాయి. శనివారం నుంచి ఆదివారం వరకు నిజామాబాద్​ ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆరు డిపోల్లో 165 మందికి పాజిటివ్​ వచ్చింది. వీరంతా బోధన్​ బార్డర్​గా మహారాష్ట్రకు ఆర్టీసీ బస్సులు నడిపిన డ్రైవర్లు, కండక్టర్లే.

అదేవిధంగా నాగపూర్​ వైపు బస్సులు నడిపించిన 155 మందికిపైగా ఆదిలాబాద్​ ఉమ్మడి జిల్లా ఆర్టీసీ కార్మికులకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. మంచిర్యాల డిపోలో ఏకంగా ముగ్గురు మృతి చెందారు. ఆదిలాబాద్​ డిపోలో శనివారం నుంచి ఆదివారం వరకు ఒకేరోజు 48 మందికి పాజిటివ్​ తేలింది. వీరు కూడా మహారాష్ట్రకు నాగపూర్​ బోర్డర్​ నుంచి బస్సులు నడిపిన ఆర్టీసీ కార్మికులు.

వీరితో పాటుగా గతంలోనే దాదాపుగా 300మందికిపైగా కార్మికులు పాజిటివ్​గా నిర్ధారణ అయ్యారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులను మహారాష్ట్ర వైపు ఇంకా నడిపిస్తూనే ఉన్నారు. నిజామాబాద్ నుంచి బోధన్​ బార్డర్​గా ఔరంగాబాద్​, నాంధేడ్​, అమరావతితో పాటు ఇతర ప్రాంతాలు, ఆదిలాబాద్​ నుంచి నాగపూర్​ బార్డర్​గా చంద్రాపూర్​ వంటి ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ సిబ్బందికి పాజిటివ్​గా తేలుతోంది. మహారాష్ట్రలో కరోనా కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో బస్సులు ఆపాలని గతంలోనే డిమాండ్​చేశారు. కానీ ఆర్టీసీ మాత్రం కేవలం ట్రిప్పులు కుదించి యధావిధంగానే సర్వీసులు కొనసాగిస్తోంది. దీంతో కరోనా కేసులు తీవ్రమవుతున్నాయి.

Next Story

Most Viewed