సిటీ శివార్లలో 290 బస్సులు రైట్ రైట్..

by  |
సిటీ శివార్లలో 290 బస్సులు రైట్ రైట్..
X

దిశ, వెబ్‌డెస్క్ :

కరోనా నేపథ్యంలో సుమారు ఆరు నెలలుగా సిటీ బస్సులు డిపోలకే పరిమితమైన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం నుంచి హైదరాబాద్ నగర శివార్లలో 290 సిటీ బస్సు సర్వీసులను నడిపించనున్నట్లు ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వరరావు తెలిపారు. అదేవిధంగా నగరంలో సిటీ బస్సులను నడిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వ అనుమతులు రాగానే బస్సులు రోడ్డెక్కుతాయని ఆయన వెల్లడించారు.

అందుకు సంబంధించి బస్సులను కూడా సిద్దం చేసి ఉంచామని, అనుమతులు రావడమే లేట్ అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రత ఇంకా తగ్గుముకం పట్టనందున కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే సిటీ బస్సులను నడిపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఈడీ వెంకటేశ్వరరావు స్పష్టంచేశారు.


Next Story

Most Viewed