బస్సు బోల్తా.. పలువురికి గాయాలు

by  |
బస్సు బోల్తా.. పలువురికి గాయాలు
X

దిశ, భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. భువనగిరి పట్టణంలోని బైపాస్ రోడ్డు వద్ద నూతనంగా నిర్మించిన మున్సిపాలిటీ భవన సమీపంలో లారీని ఢీ కొని ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, కండక్టర్‌తో సహా ఆరుగురు ప్రయాణికులు స్వల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



Next Story

Most Viewed