ఖమ్మంలో దారుణం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఆటోట్రాలీ

by  |
ఖమ్మంలో దారుణం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఆటోట్రాలీ
X

దిశ, పాలేరు : ఉమ్మడి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ళ చెరువు గ్రామం వద్ద ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్తున్న గరుడ ఏసీ బస్సును కూసుమంచి నుంచి సిమెంట్ లోడ్ దింపి ఖమ్మం వెళ్తున్న ట్రాలీ ఆటో జీళ్ల చెరువు గ్రామ శివారులో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆర్టీసీ బస్సులో 41మంది ఉన్నారు. వీరంతా క్షేమంగా ఉన్నట్టు సమాచారం. ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అవ్వగా, స్థానికులు గమనించి అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed