- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, పాలేరు : ఉమ్మడి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ళ చెరువు గ్రామం వద్ద ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్తున్న గరుడ ఏసీ బస్సును కూసుమంచి నుంచి సిమెంట్ లోడ్ దింపి ఖమ్మం వెళ్తున్న ట్రాలీ ఆటో జీళ్ల చెరువు గ్రామ శివారులో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆర్టీసీ బస్సులో 41మంది ఉన్నారు. వీరంతా క్షేమంగా ఉన్నట్టు సమాచారం. ఆటో డ్రైవర్కు తీవ్ర గాయాలు అవ్వగా, స్థానికులు గమనించి అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story