ఇక డ్రామాలు బంద్.. కేసీఆర్‌కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వార్నింగ్

by  |
rs-praveen-kumar 1
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బంధు-బందూకుల డ్రామాలకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘‘ఒకవైపు ప్రజల గొంతు నొక్కి.. ప్రజల డబ్బుతో ముఖ్యమంత్రి ‘దళిత బందు’ సభ, మరో వైపు ఒక బహుజన బిడ్డ ఓయూ స్కాలర్ పాల్వాయి నగేష్‌పై పట్టపగలే అంబేద్కర్ విగ్రహం సాక్షిగా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ అనుచరుల హత్యాయత్నం.! నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. మీ బంధు-బందూకుల డ్రామాలకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి.’’ అని వార్నింగ్ ఇచ్చారు.

Next Story

Most Viewed