బీజేపీ నేత రఘునందన్‌వే… ఆ నోట్ల కట్టలు !

by Batti.Sumithra |

<p>దిశ, వెబ్‌డెస్క్: శామీర్‌పేట టోల్‌గేట్ వద్ద సోమవారం సాయంత్రం 5గంటలకు పోలీసులకు పట్టుబడిన నగదు కేసు కొలిక్కి వచ్చింది. పట్టుబడిన నగదు మొత్తం బీజేపీ నేత రఘునందన్‌రావుదిగా పోలీసులు గుర్తించారు. నలుగురు వ్యక్తులు పటాన్‌చెరు నుంచి సిద్దిపేటకు కారులో రూ.40లక్షలు తరలిస్తుండగా మఫ్టీ పోలీసులు పట్టుకుని శామీర్‌పేట పోలీసులకు అప్పగించగా.. విచారణలో విషయం బయట పడింది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు తరలిస్తున్న నలుగురిపై కేసు నమోదు చేశామని బాలానగర్ డీసీపీ పద్మజారెడ్డి తెలిపారు. నిందితులతో రఘునందన్ [&hellip;]</p>

బీజేపీ నేత రఘునందన్‌వే… ఆ నోట్ల కట్టలు !
X

దిశ, వెబ్‌డెస్క్: శామీర్‌పేట టోల్‌గేట్ వద్ద సోమవారం సాయంత్రం 5గంటలకు పోలీసులకు పట్టుబడిన నగదు కేసు కొలిక్కి వచ్చింది. పట్టుబడిన నగదు మొత్తం బీజేపీ నేత రఘునందన్‌రావుదిగా పోలీసులు గుర్తించారు. నలుగురు వ్యక్తులు పటాన్‌చెరు నుంచి సిద్దిపేటకు కారులో రూ.40లక్షలు తరలిస్తుండగా మఫ్టీ పోలీసులు పట్టుకుని శామీర్‌పేట పోలీసులకు అప్పగించగా.. విచారణలో విషయం బయట పడింది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు తరలిస్తున్న నలుగురిపై కేసు నమోదు చేశామని బాలానగర్ డీసీపీ పద్మజారెడ్డి తెలిపారు. నిందితులతో రఘునందన్ రావు పీఏ ఫోన్‌ సంభాషణ గుర్తించినట్లు వెల్లడించారు.

Next Story