రూ.399కే కరోనా కిట్.. 3గంటల్లోనే ఫలితం

by  |
రూ.399కే కరోనా కిట్.. 3గంటల్లోనే ఫలితం
X

దిశ, వెబ్ డెస్క్:
ప్రపంచంలోనే అతి చవకైన కరోనా కిట్ అందుబాటులకి వచ్చింది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన ప్రొఫెసర్ రామగోపాల్ రావు సారథ్యంలో ఐఐటీ ఢిల్లీ సైంటిస్టులు దీనిని రూపొందించారు. ఈ కిట్ ధర రూ.399 గా నిర్ణయించారు. ల్యాబ్ ఛార్జీలు కలుపుకుని ఒక్కొ టెస్టుకు రూ.650కు మించదు. ఫలితం కూడా కేవలం 3గంటల వ్యవధిలో వెల్లడవుతుంది. ఈ కరోస్యూర్ టెస్ట్ కిట్‌కు ఐసీఎంఆర్, డీజీసీఐ ఆమోదం కూడా లభించింది. ఆర్టీపీసీఆర్ పద్ధతిలో ఈ కిట్ ద్వారా పరీక్షలు చేయవచ్చును.

Next Story

Most Viewed