గోదాదేవికి రూ.3.17 లక్షల ఆభరణాలు బహూకరణ

by  |
jewelery presented
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతిలోని శ్రీ గోవింద‌రాజస్వామివారి ఆల‌యానికి అనుబంధంగా ఉన్న శ్రీ పుండ‌రీక ‌వల్లి, శ్రీ గోదాదేవి అమ్మవార్లకు గురు‌వారం తిరుప‌తికి చెందిన కామేశ్వర‌రావు, శ్యామ‌లారాణి దంప‌తులు రూ.3.17 ల‌క్షల విలువైన బంగారు ఆభరణాలను బహూకరించారు. ఇందులో శ్రీ పుండ‌రీకవల్లి అమ్మవారికి రూ.2.07 ల‌క్షలు, శ్రీ గోదాదేవి అమ్మవారికి రూ.1.1 ల‌క్షల విలువైల బంగారు ఆభరణాలు సమర్పించారు. అనంతరం ఆభరణాలకు ఆలయంలో శాస్రోక్తంగా పూజలు నిర్వహించి అమ్మవారి ఉత్సవాలకు అలంకరించారు.



Next Story