దళిత బంధుకు మరో రూ.200 కోట్లు విడుదల

by  |
Dalit Bandhu scheme, cm kcr
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం దళితుల అభివృద్ధి కోసం తీసుకొచ్చిన దళితబంధు పథకానికి మరో రూ.200కోట్లు విడుదలయ్యాయి. విడతల వారీగా ఇప్పటివరకు రూ.1200 కోట్లు విడుదలైనట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో జరగనున్న ఉపఎన్నిక నేపథ్యంలోనే హుజురాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టుగా దళిత బంధును అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నిధులను విడుదల చేసినట్టు తెలుస్తోంది. దళితబంధు కింద ప్రతీ దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం అందించనున్నారు.



Next Story

Most Viewed