కదులుతున్న రైల్లోంచి దిగబోయి కిందపడిన గర్భిణీ.. వీడియో వైరల్

by  |
Train-Accident1
X

దిశ, వెబ్ డెస్క్: కదులుతున్న రైల్లోంచి కిందపడిన గర్భిణీని రైల్వే కానిస్టేబుల్ కాపాడిన సంఘటన ముంబైలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను రైల్వే ఉన్నతాధికారి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడా వీడియో ఇంటర్నెట్ లో వైరలవుతోంది. వివరాల్లోకి వెళితే.. గోరఖ్ పూర్ వెళ్లేందుకు వందన అనే గర్భిణీ తన కుటుంబ సభ్యులతో కలిసి మహారాష్ట్రలోని కల్యాణ్ రైల్వే స్టేషన్ కు వచ్చింది. అయితే వారంతా కూడా గోరఖ్ పూర్ వెళ్లే రైలు ఎక్కకుండా పొరపాటున వేరే రైలు ఎక్కారు. ఈ విషయం రైలు ఎక్కినంక తెలిసింది. అప్పటికే ఆ రైలు కదిలింది. అయితే, ఈ క్రమంలో కదులుతున్న రైల్లోంచి వందన దిగబోయి కిందపడింది. ఆ సమయంలో అక్కడే ప్లాట్ ఫాంపై విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆమెను కాపాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను రైల్వే ఉన్నతాధికారి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ప్రయాణికులు కదులుతున్న రైల్లోకి ఎక్కవద్దు.. అలాగే కదులుతున్న రైల్లోంచి దిగొద్దని పేర్కొన్నారు.


Next Story

Most Viewed