ఆర్టీసీ ఎండీగా ఆర్పీ ఠాకూర్

by  |
ఆర్టీసీ ఎండీగా ఆర్పీ ఠాకూర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్టీసీ ఎండీగా ఆర్పీ ఠాకూర్‌ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రింటింగ్, స్టేషనరీ కమిషనర్‌గా ఉన్న ఆర్పీ ఠాకూర్‌ను ఆర్టీసీ వీసీ, ఎండీగా ప్రభుత్వం నియమించింది. ప్రింటింగ్, స్టేషనరీ కమిషనర్ గానూ ఠాకూర్‌కు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది. 2019లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డీజీపీగా ఉన్న ఆర్పీ ఠాకూర్‌ను ప్రింటింగ్, స్టేషనరీ కమిషనర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర తర్వాత కొత్త బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.

Next Story

Most Viewed