టీమ్ ఇండియా మాజీ పేసర్ ఆర్పీ సింగ్ తండ్రి మృతి

by  |
టీమ్ ఇండియా మాజీ పేసర్ ఆర్పీ సింగ్ తండ్రి మృతి
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మాజీ పేసర్ ఆర్పీ సింగ్ తండ్రి శివప్రసాద్ సింగ్ బుధవారం కోవిడ్ బారిన పడి మృతి చెందారు. “మా నాన్న శివప్రసాద్ సింగ్ ఇక లేరనే సమాచారాన్ని తీవ్రమైన దుఖం, బాధతో తెలియజేస్తున్నాను. ఆయన కోవిడ్ కారణంగా ఈ రోజు మమ్మల్ని విడిచి వెళ్లారు. నాన్న ఆత్మకు శాంతి చేకూరాలని మీరంతా భగవంతుడిని ప్రార్థించాలని కోరుతున్నాను” అని ఆర్పీసింగ్ ట్వీట్ చేశాడు. టీమ్ ఇండియా తరపున 14 టెస్టులు, 58 వన్డేలు, 10 టీ20లు ఆడిన ఆర్పీసింగ్ 2018లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. కాగా, గత కొన్ని రోజులుగా క్రికెటర్ల కుటుంబాల్లో కరోనా విషాదాన్ని నింపుతున్నది. భారత మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి తల్లి, సోదరి రెండు వారాల వ్యవధిలోనే కోవిడ్ బారిన పడి మరణించగా.. టీమ్ ఇండియా వెటరన్ స్పిన్నర్ పీయుష్ చావ్లా తండ్రి ప్రమోద్ కుమార్ చావ్లా, రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు చేతన్ సకారియా తండ్రి కంజీబాయ్ సకారియా కూడా కరోనా కారణంగా మృతి చెందారు.



Next Story