టాస్ గెలిచిన ఆర్సీబీ.. పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు వెళ్లేనా..?

by  |
టాస్ గెలిచిన ఆర్సీబీ.. పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు వెళ్లేనా..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌ 2021 సీజన్‌లో మరో ఉత్కంఠ పోరు మొదలైంది. షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనింగ్‌లో విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ క్రీజులోకి వచ్చారు. కాగా, ఇప్పటికే 11 మ్యాచులు ఆడిన ఆర్సీబీ 7 విజయాలు, 4 పరాజయాలు నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్ 12 మ్యాచుల్లో 5 విజయాలు, 7పరాజయాలు నమోదు చేసుకుంది. దీంతో ప్లే ఆఫ్స్ కోసం జట్ల మధ్య పోటీ పెరగడంతో ఆర్సీబీ-పంజాబ్ మ్యాచ్‌ ఉత్కంఠను రేపుతోంది. ఈ మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారో అని ఆయా జట్ల అభిమానులు వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు.

Next Story

Most Viewed