రాబోయే మ్యా‌చ్‌లో తప్పక గెలుస్తాం : కోహ్లీ

by  |
రాబోయే మ్యా‌చ్‌లో తప్పక గెలుస్తాం : కోహ్లీ
X

దిశ, వెబ్‌డెస్క్: అబుదాబి వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ముంబై బ్యాట్‌మెన్ సూర్య కుమార్ యాదవ్ చెలరేగిపోయాడు. ఒంటిచేత్తో జట్టును గెలిపించి, ప్లేఆఫ్స్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. కాగా ఈ మ్యాచ్‌లో బెంగళూరు విధించిన 165 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో ముంబై ఇండియన్స్ జట్టు చేధించి విజయం సాధిచింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం రాయల్ చాలెంజర్స్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుగూ…

‘మేము బ్యాటింగ్ చేసే సమయంలో చివరి 5 ఓవర్లు దెబ్బతీశాయి. మేము మరిన్ని పరుగులు చేయాల్సింది. ముంబయి జట్టు డెత్ ఓవర్లు చాలా బాగా వేశారు. బౌలింగ్ సమయంలో కూడా 17వ ఓవర్ వరకు మ్యాచ్ మా చేతిలోనే ఉంది. కానీ సూర్యకుమార్ ప్రదర్శన కారణంగా మ్యాచ్ జారిపోయింది. స్టెయిన్, మోరిస్ బంతిని బాగా స్వింగ్ చేయగలరనే సిరాజ్‌కు కొత్త బంతి ఇవ్వలేదు. రాబోయే మ్యాచ్‌లలో తప్పక గెలిచి ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకుంటాము.’ అని విరాట్ వెల్లడించారు.


Next Story