కండ్లల్లో కారం కొట్టి కత్తులతో హత్య

by  |
కండ్లల్లో కారం కొట్టి కత్తులతో హత్య
X

దిశ, బేగంపేట : ఒక వ్యక్తిని దారుణంగా హతమార్చారంటే దానికి వెనుక పెద్ద కారణమే దాగి ఉంటుంది. కత్తి పట్టిన వ్యక్తి అదే కత్తికి బలిఅవుతారని నానుడి కూడా ఉంది. ఇదే తరుణంలో ఆస్తుల కోసం ఎంతో మంది బలయ్యారు. తాజాగా హైదరాబాద్ నగరంలో రౌడీషీటర్ హత్య కలకలం రేపింది. భూవివాదాలు, పాతకక్షలు అతడి ప్రాణాన్ని బలితీసుకున్నాయి.

పూర్తి వివరాళ్లోకి వెళితే.. సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆర్కే సొసైటీ‌ సమీపంలో రౌడీషీటర్ ఫిరోజ్‌పై గుర్తుతెలియని దుండగులు సోమవారం రాత్రి 10 గంటల సమయంలో దాడి చేశారు. కండ్లల్లో కారం కొట్టి కత్తులతో దాడికి పాల్పడ్డారు. తీవ్రగాయాలైన అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మంగళవారం ఉదయం మృతి చెందారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురికి తరలించారు.

పాత కక్షలేనా?

అయితే, కూకట్‌పల్లి, ఎస్ఆర్‌నగర్, సనత్‌నగర్ పీఎస్‌ పరిధిలో ఫిరోజ్‌పై భూ కబ్జా ఆరోపణలపై కేసులు ఉన్నట్టు పోలీసులు చెప్పారు. గతంలో రౌడీషీటర్ వాహిద్ హత్య కేసులో ఫిరోజ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న సనత్‌నగర్ పోలీసులు.. అతని హత్యకు పాతకక్ష్యలు కారణమా? లేక మరేమైనా ఉన్నాయా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

Next Story

Most Viewed