అధికార లాంచనలతో.. ముగిసిన రోశయ్య అంత్యక్రియలు

by  |
అధికార లాంచనలతో.. ముగిసిన రోశయ్య అంత్యక్రియలు
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ కురువృద్దులు కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు ముగిశాయి. మేడ్చల్ జిల్లా, కొంపల్లి, దేవరయాంజాల్ ఫామ్ హౌజ్ లో అదివారం సాయంత్రం తన ఫామ్ హౌజ్ లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. రోశయ్యను కడసారి చూసేందుకు బంధువులు, రెండు రాష్ట్రాల నుంచి వివిధ పార్టీల నేతలు, రోశయ్య అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అశృనయనాల మధ్య హిందూ సంప్రాదాయంతో కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద కుమారుడు తండ్రి చితికి నిప్పంటించడంతో అంత్యక్రియలు ముగిశాయి. కాగా రోశయ్య శనివారం ఉదయం నిద్రలోనే తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం తరపున మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి , పేర్నినాని, బాలినేని శ్రీనివాస్ రెడ్డిలు హాజరయ్యారు.

Next Story

Most Viewed