థియేటర్‌లో రిలీజ్ కాబోతున్న జాన్వీ సినిమా

by  |
థియేటర్‌లో రిలీజ్ కాబోతున్న జాన్వీ సినిమా
X

దిశ, సినిమా : కరోనా తర్వాత మొదటిసారిగా ‘ఏ – లిస్ట్’ స్టారింగ్‌తో కూడిన హిందీ సినిమా బిగ్ స్క్రీన్స్‌ను టచ్ చేయనుంది. రాజ్ కుమార్ రావ్, జాన్వీ కపూర్ కలిసి నటించిన ‘రూహి అఫ్జానా’ చిత్రం మార్చి ఫస్ట్ వీక్‌లో థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. హర్రర్ కామెడీ జోనర్‌లో వస్తున్న ఈ చిత్రం ‘స్త్రీ’ మూవీకి సీక్వెల్‌గా వస్తుండగా.. ఆడియన్స్‌ను తిరిగి థియేటర్స్‌లోకి తీసుకొస్తుందనే నమ్మకంతో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్. మరోవైపు గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీకి పర్మిషన్ ఇవ్వడంతో థియేట్రికల్ రిలీజ్‌కు ముందుకొచ్చిన మేకర్స్.. థియేట్రికల్ బిజినెస్‌‌పై హ్యాపీగా ఉన్నారు. హార్దిక్ మెహతా దర్శకత్వం వహించిన సినిమాను దినేష్ విజన్ ప్రొడక్షన్‌ నిర్మించగా.. సినిమా రిలీజ్ డేట్‌‌‌‌‌‌‌పై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాబోతోంది. కాగా ఈ చిత్రం సక్సెస్‌ను బేస్ చేసుకుని ‘సూర్యవంశీ’, ‘83’ లాంటి బాలీవుడ్ బిగ్ మూవీస్ కూడా థియేట్రికల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే చాన్స్ ఉంది.

కాగా కరోనాకు ముందు చివరగా థియేటర్స్‌లో వచ్చిన ఇర్ఫాన్ ఖాన్ ‘ఆంగ్రేజీ మీడియం’ సినిమాను నిర్మించింది కూడా దినేష్ విజన్ ప్రొడక్షన్స్ కాగా.. అదే బ్యానర్‌ నుంచి వస్తున్న ‘రూహి అఫ్జానా’ కరోనా తర్వాత స్క్రీన్స్ టచ్ చేయబోతున్న ఫస్ట్ మూవీ కావడం విశేషం.



Next Story

Most Viewed