హిట్‌మ్యాన్‌కు షాక్.. ఏకంగా రూ.12 లక్షలు ఫైన్

by  |
హిట్‌మ్యాన్‌కు షాక్.. ఏకంగా రూ.12 లక్షలు ఫైన్
X

దిశ, వెబ్‌డెస్క్: హిట్‌మ్యాన్‌గా క్రికెట్ అభిమానులందరూ పిలుచుకునే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు షాక్ తగలింది. ఏకంగా రూ. 12 లక్షలు జరిమానా పడింది. మంగళవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయం కంటే ముంబై ఇండియన్స్ ఎక్కువ సమయం తీసుకుంది. దీంతో స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ రోహిత్‌కు మ్యాచ్ రిఫరీ రూ.12 లక్షలు జరిమానా విధించాడు.

రెండోసారి ఇదే తప్పు చేస్తే రూ. 24 లక్షల జరిమానా పడుతుంది. మూడోసారి చేస్తే.. కెప్టెన్‌పై ఒక మ్యాచ్ నిషేధం విధించడంతో పాటు రూ.30 లక్షలు జరిమానా విధించే అవకాశముంది. ఇప్పటికే ధోనీ, కోహ్లీ స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానాలను ఎదుర్కొన్నారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం నిర్ణీత సమయం లోపు మ్యాచ్ పూర్తయ్యేలా కెప్టెన్లు చూసుకోవాలి.



Next Story

Most Viewed