అవి రోడ్ల, కాలువలా.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులు..

by  |
roads
X

దిశ, చౌట్కూర్: సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండల నుండి పోసానిపల్లికి వెళ్లే రోడ్డు పరిస్థితి దయనీయంగా మారింది. రోడ్డు పొడవునా పెద్ద పెద్ద గుంతలు ప్రమాదకరంగా ఉన్నాయి. సింగూర్ కెనాల్ ద్వార ఈ రోడ్డు మీదకు నీరు వస్తుంది. ఈ రోడ్డు‌పై నుండి చౌట్కూర్ చెరువులోకి నీటిని వదిలారు. నీటి ప్రవాహానికి రోడ్డు మొత్తం కొట్టుకొపోయి భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఈ గుంతల్లోకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొ్ంటున్నారు. పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ గుంతల్లో వాహనదారులు కింద పడి ప్రమాదాలు జరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ విషయంపై అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Next Story

Most Viewed