- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, చౌట్కూర్: సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండల నుండి పోసానిపల్లికి వెళ్లే రోడ్డు పరిస్థితి దయనీయంగా మారింది. రోడ్డు పొడవునా పెద్ద పెద్ద గుంతలు ప్రమాదకరంగా ఉన్నాయి. సింగూర్ కెనాల్ ద్వార ఈ రోడ్డు మీదకు నీరు వస్తుంది. ఈ రోడ్డుపై నుండి చౌట్కూర్ చెరువులోకి నీటిని వదిలారు. నీటి ప్రవాహానికి రోడ్డు మొత్తం కొట్టుకొపోయి భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఈ గుంతల్లోకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొ్ంటున్నారు. పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ గుంతల్లో వాహనదారులు కింద పడి ప్రమాదాలు జరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ విషయంపై అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Next Story