- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, అశ్వారావుపేట : రాష్ట్రంలో ఓవైపు జోరుగా వర్షాలు కురుస్తున్న సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం గ్రామ శివారులో సీతారామ కాలువ వంతెన వద్ద మంగళవారం రాత్రి మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్ లీకేజ్ అయ్యింది. దీంతో దమ్మపేట- పాల్వంచ ప్రధాన రహదారి పూర్తిగా కుంగిపోయింది.
రోడ్డు కుంగిపోయిన విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన వారు మిషన్ భగీరథ నీటి సరఫరాను నిలిపివేశారు. అక్కడకు చేరుకున్న ములకలపల్లి ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో రహదారి కుంగిన ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను నిలిపివేశారు. దీంతో ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
Next Story