- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, రాజేంద్రనగర్ : వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ ప్రకాష్ రెడ్డి కథనం ప్రకారం.. నగరంలోని బోడుప్పల్ నుంచి రాకేష్ కుమార్, భార్య సుమలత ఇద్దరూ హ్యుందాయ్ ఐ20 (AP 23 R 0999) కారులో మహబూబ్ నగర్ వెళ్లేందుకు బయలుదేరారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండపల్లి వద్దకు రాగానే ఒక్కసారిగా కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. రాకేష్ కుమార్ (33) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా, భార్య సుమలత(26)కు తీవ్ర గాయాలు కావడంతో శంషాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రకాష్ రెడ్డి తెలిపారు.