భయానక రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్

by  |
భయానక రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
X

దిశ, కోరుట్ల రూరల్ : కోరుట్ల మండలం మోహన్ రావుపేట గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులతో పాటు కారు డ్రైవర్ మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

వివరాల్లోకి వెళితే.. కోరుట్ల పట్టణంలోని బిలాల్ పుర ప్రాంతానికి చెందిన జావిద్ సులేమన్ (40) అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన భార్య సుమయా (35), ముగ్గురు కుమారులు అనాస్ (20), అస్సు (16), అజీమ్ (6) లతో కలిసి కోరుట్ల కు చెందిన సాజిద్ అలీ అనే కారు డ్రైవర్ తో హైదరాబాద్‌కు టీఎస్ 04 ఈడీ 0999 అనే నంబర్ గల కారులో గత మూడు రోజుల క్రితం షాపింగ్ కోసం వెళ్లి ..తిరిగి శనివారం కోరుట్లకు వస్తుండగా, కోరుట్ల మండలం మోహన్ రావుపేట శివారులో జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న టీఎస్ 21టీ 2452 అనే నంబర్ గల బస్సును కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ సాజిద్ ఆలీ (40), జావిద్ సులేమన్ కుమారులు అనాస్, అజామ్ లకు తీవ్ర గాయాలై మృతి చెందగా, జావిద్ సులేమన్, అతని భార్య సుమయా, అస్సులకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.


Next Story