యూపీలో రోడ్డు ప్రమాదం: ఆరుగురి మృతి

by  |

యూపీలోని లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ఒకరోజు వ్యవధిలోనే మరో ప్రమాదం చోటుచేసుకుంది. కాన్పూర్ సమీపంలోని మకన్‌పూర్‌లో సోమవారం అర్ధరాత్రి బీహార్ స్టేట్ ట్రాన్స్‌పోర్టుకు చెందిన బస్సు అదుపు తప్పి కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు, బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.


Next Story

Most Viewed