- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి లారీ బోల్తాపడింది. దీంతో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా, మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. లారీ కింద చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులందరూ శంషాబాద్ మండలం సుల్తాన్పల్లి ఇటుక బట్టీల్లో పనిచేసే కూలీలుగా గుర్తించారు. వీరందరు నిత్యావసరాలు కొనేందుకు శంషాబాద్ మార్కెట్కు లారీలో వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్పష్టం చేశారు. డ్రైవర్ మద్యం తాగి నడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story