చెరువులోకి దూసుకెళ్లిన ఆటో.. 8 మందికి గాయాలు

by  |
చెరువులోకి దూసుకెళ్లిన ఆటో.. 8 మందికి గాయాలు
X

దిశ, షాద్ నగర్: చెరువులో ఆటో బోల్తాపడిన సంఘటన షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం మహాదేవ్ పూర్ వద్ద సోమవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. షాద్ నగర్ నుండి ముట్టుపూర్‌కు ప్రయాణికులతో వెళుతున్న ఆటో మహాదేవ్ పూర్‌లో అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెరువులోకి పడిపోయింది. దీనిలో ప్రయాణిస్తున్న వారిలో 8మందికి గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందులో ముట్టుపూర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు మోహనరావు, కుర్మరావు‌లకు గాయాలయ్యాయి. ఈ మధ్యకాలంలో గ్రామాలకు షాద్ నగర్ డిపో నుండి ఆర్టీసి బస్సులు బంద్ చేయడం వల్ల ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి ఇలాంటి ప్రమాదాలకు గురికావాల్సివస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు.

Next Story

Most Viewed