సంగారెడ్డిలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

by  |
road accident
X

దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుల్కల్ మండలం చౌటకూరులో కారును లారీ ఢీకొనడంతో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. సంగారెడ్డి నుంచి మెదక్ వైపు వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story