లారీ, ఆరెంజ్ ట్రావెల్స్ బస్ ఢీ..

by  |
లారీ, ఆరెంజ్ ట్రావెల్స్ బస్ ఢీ..
X

దిశ, ఏపీ బ్యూరో : ప్రకాశంజిల్లాలోజరిగిన రోడ్డుప్రమాదంలో పదిమందికి తీవ్రగాయాలయ్యాయి. గురువారం అర్థరాత్రి రెండుగంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏపీ16 టీజే 5963 నెంబరు గల ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు బెంగళూరు నుంచి వైజాగ్ వెళ్తుంది. ఇది గుడ్లూరు మండలం శాంతినగరం వద్దకు రాగానే చెన్నై నుంచి విజయవాడ వెళ్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్యాసింజర్లకు తీవ్రమైన గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న గుడ్లూరు ఎస్సై మల్లికార్జునరావు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed