మేర్లపాక దగ్గర ప్రైవేటు బస్సు బోల్తా

by  |
మేర్లపాక దగ్గర ప్రైవేటు బస్సు బోల్తా
X

దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా తిరుపతిలోని మేర్లపాక దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం అదుపుతప్పి మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కాగా, ప్రమాదాలకు డేంజర్ స్పాట్‌గా మేర్లపాక మలుపు మారింది. నెల రోజుల వ్యవధిలో ఇదే ప్రాంతంలో తొమ్మిది బస్సులు బోల్తా పడ్డాయి

Next Story