ఖానాపూర్‌లో దారుణం.. టాటా ఏస్ ట్రాలీని ఢీకొట్టిన లారీ

by  |
ఖానాపూర్‌లో దారుణం.. టాటా ఏస్ ట్రాలీని ఢీకొట్టిన లారీ
X

దిశ, ఖానాపూర్ : వరంగల్ జిల్లాలోని ఖానాపూర్ మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. జాతీయ రహదారి 365 పై వేగంగా వచ్చిన లారీ టాటా ఏస్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో జూపాక రాకేశ్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. ఖానాపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ నుంచి కూలీలతో బయలుదేరిన టాటా ఏస్ వాహనం వేపచెట్టు తండాకు పని కోసం వెళ్తున్నది.

కాలనీ రోడ్ నుంచి జాతీయ రహదారి వైపుకు తిరుగుతున్న క్రమంలో నర్సంపేట నుంచి మహబూబాబాద్‌కు ఎర్రమట్టి లోడ్‌తో వస్తున్న లారీ(ఏపీ 24- 6298) వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో టాటా ఏస్ కింద పడి రాకేశ్ రెండు కాళ్లకు తీవ్ర గాయాలవ్వగా, మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. అనంతరం వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించి దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story