ఘోర రోడ్డు ప్రమాదం.. అతివేగమే కారణమా ?

by  |
ఘోర రోడ్డు ప్రమాదం.. అతివేగమే కారణమా ?
X

దిశ, ఖానాపూర్: మండలం లోని అశోకనగర్ శివారులోని అయోధ్య నగర్ వద్ద అతివేగంతో వెళ్తున్న ఆటో ప్రమాదానికి గురైంది. ఎస్ఐ తాజోద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. నర్సంపేట నుంచి చిలకమ్మ నగర్ వైపు ప్రయాణిస్తున్న ఆటో అతివేగంతో వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న సైకిల్‌ని తప్పించబోయి ప్రమాదానికి గురైంది. ఆటోలో ప్రయాణిస్తున్న అనసూర్య, ఆటో డ్రైవర్ యాకూబ్, చిలకమ్మ నగర్ వాస్తవ్యులకి స్వల్ప గాయలవగా వీరిని చికిత్స నిమిత్తం నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఎస్ఐ వాహన తనిఖీలు చేపట్టి అతివేగం, పరిమితి మించి ప్రయాణికులను తరలిస్తున్న వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. రహదారులపై ధాన్యం ఆరబోసి ఉన్నందున వాహనదారులు నెమ్మదిగా ప్రయాణించాలని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story