ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళా కూలీలతో వెళ్తున్న ఆటో, ట్రాక్టర్ ఢీ

by  |
ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళా కూలీలతో వెళ్తున్న ఆటో, ట్రాక్టర్ ఢీ
X

దిశ, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను ట్రాక్టర్ ఢీ కొనడంతో కూలీ మృతి చెందిన ఘటన జిల్లాలోని స్టేషన్ ఘన్ పూర్ మండలం పామునూరు శివారులో సోమవారం జరిగింది.

స్థానికుల కథనం ప్రకారం స్టేషన్ ఘన్ పూర్ నుండి జఫర్గడ్ మండలం కునూరు గ్రామానికి పత్తి తీసేందుకు రెండు ఆటోలు తొమ్మిది మంది మహిళా కూలీలతో వెళ్తుంది. ఈ క్రమంలో వెనక నుండి వస్తున్న ఒక ట్రాక్టర్ అతి వేగంగా వెళ్లి కూలీలతో వెళ్తున్న ఆటోను వెనకనుంచి ఢీ కొట్టింది. దీంతో ఆటో రోడ్డు పక్కన ఉన్న చెట్టును వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మోడెం కల్పన(35) ను స్టేషన్ ఘన్ పూర్ ఉన్నత శ్రేణి ఆరోగ్య కేంద్రానికి తరలించి నప్పటికీ సకాలంలో వైద్యం అందక ఆమె మృతి చెందింది. ఆమెతో పాటు గాయపడిన ఆటో డ్రైవర్ డాక్టర్ రాజ్ కుమార్, దీపిక‌తో పాటు పలువురు గాయపడిన కూలీలకు ప్రథమ చికిత్స అందించి 108 అంబులెన్స్ ద్వారా ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

Next Story