భయానక రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ముగ్గురి పరిస్థితి సీరియస్

by  |
భయానక రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ముగ్గురి పరిస్థితి సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్ : గుంటూరు జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని యడ్లపాడు వద్ద నేషనల్ హైవేపై గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది గాయపడ్డారు. దీంతో గాయపడిన వారిని వైద్యం కోసం జీజీహెచ్‌కు తరిలించారు. వారిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. మిగతా క్షతగాత్రులకు చికిత్స జరుగుతున్నట్టు సమాచారం. అయితే వీరంతా చిలకలూరిపేట నుంచి తుమ్మలపాలెం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.


Next Story