గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

by  |
గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : ఈరోజు తెల్లవారుజూమున నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం ఎదురుగా రామచందర్(48) అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా.. అతి వేగంగా వస్తున్న మారుతి కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.



Next Story