ఘోర ప్రమాదం.. ముగ్గురు మహిళలు మృతి

by  |
ఘోర ప్రమాదం.. ముగ్గురు మహిళలు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నేండ్రగుంటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా వెళ్తున్న లారీని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మ‌ృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు రాజమ్మ, అన్నపూర్ణ, చిన్నారి జ్యోతిగా గుర్తించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story