ఘోర ప్రమాదం.. టిప్పర్‌ను ఢీకొన్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు

by  |
ఘోర ప్రమాదం.. టిప్పర్‌ను ఢీకొన్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు
X

దిశ, చౌటుప్పల్ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం స్టేజి వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయవాడ నుంచి వస్తున్న ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు లక్కారం వద్ద రాంగ్ రూట్‌లో ఎదురుగా వస్తున్నా టిప్పర్ లారీని బలంగా ఢీకొట్టింది.

దీంతో టిప్పర్, ట్రావెల్స్ బస్సు ముందు భాగాలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు 10 – 12 మందికి గాయాలు కావడంతో చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద తీవ్రత పెద్దగా లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ సీఐ ఎన్. శ్రీనివాస్ తెలిపారు.



Next Story

Most Viewed