మిషన్ భగీరథ పైపును ఢీకొన్న లారీ.. ఫౌంటేన్‌లా ఎగిసిపడుతున్న నీరు..(వీడియో)..

by  |
మిషన్ భగీరథ పైపును ఢీకొన్న లారీ.. ఫౌంటేన్‌లా ఎగిసిపడుతున్న నీరు..(వీడియో)..
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఈద్గా చౌరస్తా వద్ద మిషన్ భగీరథ పైపును లారీ ఢీకొట్టింది. దీంతో పైపు పగిలిపోయి భగీరథ నీరు వృథాగా పోతోంది. మిషన్ భగీరథ పైప్ వద్ద ఓ లారీ నిలిపి ఉంచడంతో బైంసా నుంచి వస్తున్న టిప్పర్.. లారీని వెనకనుండి ఢీకొట్టింది.

ఈ క్రమంలో లారీ.. ముందున్న పైపును ఢీకొంది. దీంతో ఒక్కసారిగా నీరు పెద్ద ఎత్తున ఎగిసిపడుతోంది. ఈ కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లారీని వెనుక నుండి టిప్పర్ ఢీకొనడంతో టిప్పర్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

Next Story