'బీహార్‌లో పరిస్థితి ఘోరంగా ఉంది'

by  |
బీహార్‌లో పరిస్థితి ఘోరంగా ఉంది
X

దిశ, వెబ్ డెస్క్: బీహార్ రాష్ట్రంలో కరోనా కేసుల విషయమై ఆర్జేడీ నాయకుడు తేజశ్వీ యాదవ్ మాట్లాడారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీహార్ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయని, దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారని, అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ మండిపడ్డారు. అంతేకాదు రాష్ట్రంలో దేశంలోనే తక్కువ సంఖ్యలో కరోనా టెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం కరోనా కేసుల సంఖ్యలను తారుమారు చేస్తోందన్నారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నందున పరిస్థితిని సమీక్షించడానికి కేంద్రప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని బీహార్ కు పంపుతోందని ఆయన చెప్పారు.



Next Story