సుశాంత్ కేసు: రియా చక్రవర్తి రూ.10 లక్షలు ఇస్తోందట?

by  |
సుశాంత్ కేసు: రియా చక్రవర్తి రూ.10 లక్షలు ఇస్తోందట?
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో బీహార్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసు దర్యాప్తు బృందం ఇప్పటికే ముంబైలోని బాంద్రాకు చేరుకుని సుశాంత్‌ బ్యాంకు ఖాతాలను పరిశీలించింది. సుశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు రియా చక్రవర్తి తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా.. రియా చక్రవర్తి ముంబైలో ప్రఖ్యాత లాయార్ సతీశ్ మాన్ షిండే‌కు తన కేసును అప్పగించినట్టు.. అతనికి ఫీజు కింద నెలకు రూ. 10 లక్షలు చెల్లిస్తున్నట్లు ఓ వార్త ట్రెండ్ అవుతోంది. ఇంత భారీ మొత్తంలో నగదు చెల్లిస్తున్న రియా చక్రవర్తిపై పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే కేసు విచారణ పూర్తయితే మరింత స్పష్టత వచ్చే అవకాశముంది.

Next Story

Most Viewed