వాహనదారులకు చుక్కలు చూపిస్తున్న ఇంధన ధరలు

by  |
వాహనదారులకు చుక్కలు చూపిస్తున్న ఇంధన ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు. గడిచిన ఏడురోజుల్లో నాలుగు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. సోమవారం మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోల్ పై 28 పైసలు, డీజిల్‌పై 29పైసలు పెరిగింది. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.95.31ఉండగా డీజిల్ ధర రూ.86.22 ఉంది. ఇక వాణిజ్య నగరమైన ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.52 ఉండగా, డీజిల్ ధర రూ. 93.58గా ఉంది. అలానే చెన్నైలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 96.71 ఉండగా, లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ. 89.07గా ఉంది. ఇక తెలుగురాష్ట్రాలలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.99.05ఉండగా డీజిల్ ధర రూ.94గా ఉంది. అలానే విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.30 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 95.64గా ఉంది.



Next Story

Most Viewed