జూరాలకు పెరుగుతున్న వరద

by  |
జూరాలకు పెరుగుతున్న వరద
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: గత రెండ్రోజులుగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూరాలకు మరోసారి వరదనీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు సంబంధించి అధికారులు 20 గేట్స్ ఎత్తివేతి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాలకు ఇన్ ఫ్లో 1,65,000 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 1,61,475 క్యూసెక్కులుగా ఉంది.

అలాగే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలకు ప్రస్తుత నీటి నిల్వ 8.454 టీఎంసీలుగా ఉండగా పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లకు ప్రస్తుత నీటి మట్టం 317.920 మీటర్లు ఉన్నట్టు అధికారులు తెలిపారు. అదేసమయంలో ఎగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో 6 యూనిట్స్ లో 234 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో 6 యూనిట్స్ 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.



Next Story

Most Viewed