‘మర్డర్’కు కుదిరిన ముహూర్తం..

by  |
‘మర్డర్’కు కుదిరిన ముహూర్తం..
X

దిశ, వెబ్‌డెస్క్: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మిర్యాలగూడకు చెందిన ప్రణయ్, అమృతల ప్రేమ కథా ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో వివాదాల అనంతరం ఈ సినిమాకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమాలో ప్రణయ్, అమృత పేర్లు, ఫోటోలు, వీడియోలు వాడకుండా జాగ్రత్త పడాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పుపై సంతోషాన్ని వ్యక్తం చేసిన ఆర్జీవీ, కరోనా కారణంగా మూతపడిన థియేటర్లు ఓపెన్ అయ్యాక విడుదల చేయాలని భావించాడు. అయితే ఇటీవలే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్ కావడంతో ఈ సినిమాను డిసెంబర్ 24న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. క్విటీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టి కరుణ, నట్టి క్రాంతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించారు.

Next Story

Most Viewed