టెక్నాలజీతోపాటు మారకపోతే మట్టిలో కలుసుడే: ఆర్జీవీ

by  |
టెక్నాలజీతోపాటు మారకపోతే మట్టిలో కలుసుడే: ఆర్జీవీ
X

మారుతున్న టెక్నాలజీ తోపాటు తాను మారకపోతే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మట్టిలో కలిసిపోతుందంటున్నారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. కరోనా నేపథ్యంలో సినిమా హాళ్లు మూసేయడంతో నిర్మాతలంతా ఓటీటీ వైపు చూస్తుంటే.. అంతకు మించిన అప్‌డేట్‌తో దూసుకెళ్తా అంటున్నారు. థియేటర్ల పై ఓటిటిల ప్రభావం చాలా కాలం నుంచి ఉన్నపటికీ కరోనా వైరస్ లాక్ డౌన్ ప్రతి ఒక్కరి కళ్లు తెరిపించిందన్నారు. కాగా తన కొత్త సినిమా “క్లైమాక్స్” ను శ్రేయాస్ ఎంటర్టైన్మెంట్ యాప్ లో మే 29న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. కాగా పోర్న్ స్టార్ మియా మాల్కోవా ఫిమేల్ లీడ్ లో ఆర్జీవీ తెరకెక్కించిన “క్లైమాక్స్” మూవీ ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయింది.

Next Story

Most Viewed