బైక్‌పై రూ.28 వేల భారీ డిస్కౌంట్.. మధ్యాహ్నం నుంచే బుకింగ్స్

by  |
బైక్‌పై రూ.28 వేల భారీ డిస్కౌంట్.. మధ్యాహ్నం నుంచే బుకింగ్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మోటార్ వాహనాల తయారీ సంస్థ రివాల్ట్ మోటార్స్ వాహన కొనుగోలుదారులకు భారీ శుభవార్త తెలిపింది. ఒకేసారి రూ.28 వేల భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఎలక్ట్రిక్ బైక్ ఆర్‌వి 400 బైక్ కొనుగోలుపై రూ.28 వేలు తగ్గించింది. దీంతో ఎక్స్‌షోరూమ్‌లో ఈ బైక్ రూ.90,799కి లభించనుంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫేమ్ 11 పథకంలో భాగంగా ఈ భారీ తగ్గింపును ప్రకటించింది.

నేటి నుంచి ఈ బైక్ బుకింగ్స్ తిరిగి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, పూణే, అహ్మదాబాద్‌లలో బుకింగ్స్ ప్రారంభించనుంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. బుక్ చేసిన బైక్‌లు సెప్టెంబర్ లోగా డెలివరీ అవుతాయని తెలిపింది. www.revoltmotors.com వెబ్ సైట్‌లోకి వెళ్లి ‘నోటిఫై మి’ ఆప్షన్ మీద క్లిక్ చేసి బుక్ చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. గతంలో ప్రారంభించిన బుకింగ్స్‌కు భారీ స్పందన వచ్చింది. దీంతో మరోసారి బుకింగ్స్ ప్రారంభించాలని నిర్ణయించింది.

రివాల్ట్ RV400 బైక్ ఫీచర్లు

-గంటకు 85 కిలోమీటర్ల వేగం
-లొకేషన్, జియో ఫెన్సింగ్ సదుపాయం
-బైక్ పరిస్థితి, బ్యాటరీ లెవల్స్, రైడ్, చార్జింగ్ స్టేషన్ వివరాలు తెలుసుకునే అవకాశం
-KW (మిడ్ డ్రైవ్) మోటారు



Next Story

Most Viewed